Thursday, 12 November 2015

రైతు సమస్యలపై బాబు హామీ ఇచ్చారు అంటున్న పవన్

చంద్రబాబు తో భేటి ఐన పవన్ కళ్యాణ్ భేటి వివరాలను మీడియా తో పంచుకున్నారు.


ఈ ఉదయం వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలిసి భాగ్యనగరం నుండి ప్రత్యేక విమానం లో విజయవాడ బయలుదేరిన పవన్ కళ్యాణ్  11 గంటలకు బాబు తో భేటి అయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు బాబు తో సమావేశం ఐన పవన్ పలు సమస్యలపై చర్చించారు. 
భేటి విషయాలను మీడియా తో పంచుకున్న పవన్ కళ్యాణ్ తానూ రాజధాని రైతుల విషయం పై చర్చించడానికి సిఎం ని కలిసినట్టు తెలిపారు. ఇంకా  బాక్సైట్ తవ్వకాల విషయం లో గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్టు తెలిపారు. రైతులకు, గిరిజనులకు నష్టం కలగకుండా చూస్తాం అని బాబు తనకి హామీ ఇచ్చినట్టు తెలిపారు.
ఇంకా ప్రత్యేక హోదా పై మీడియా అడిగిన ప్రశ్నలకు గాను మోడీ పై తనకి నమ్మకం ఉంది అని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక హోదా విషయం లో వెనకడుగు వేస్తె ఏం చేయాలో అప్పుడు నిర్ణయించుకుంటా అని తెలిపారు 

0 comments:

Post a Comment